తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం సాధ్యమేనా అనుకుంటున్న తరుణంలో బాహుబలి ఐదువందల కోట్ల మార్కును దాటి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాటలోనే మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం 60కోట్ల బడ్జెట్తో నిర్మాణం జరుపుకొని 25 రోజులకే 154 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి తరువాత స్థానాన్ని శ్రీమంతుడు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా హీరో మహేష్బాబు మాట్లాడుతూ శ్రీమంతుడు నా కెరీర్లో బెస్ట్ ఫిలిమ్గా నిలిచింది.
ఈ సినిమా విజయం పట్ల నా అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతృప్తిగా వుంది. శ్రీమంతుడు లాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఈ విజయం నాకు మంచి స్ఫూర్తినిచ్చింది. దర్శకుడు కొరటాల శివ అద్భుతమైన కథనిచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. అందరి కృషితో మంచి విజయం దక్కింది అన్నారు. 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల గ్రాస్ను 95 కోట్ల 32 లక్షల 42 వేల 733 రూపాయల షేర్ను సాధించిందని, కేవలం తెలంగాణలోనే 21కోట్ల 5లక్షల 59వేల 99రూపాయల షేర్ను వసూలు చేసి నైజాంలో మహేష్బాబు స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసిందని, శ్రీమంతుడు చిత్రం బాహుబలి తరువాత తెలుగు చిత్రపరిశ్రమలో నెంబర్ టూ స్థానాన్ని దక్కించుకుందని ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది.
0 comments:
Post a Comment